Monday, August 01, 2005

ఐదారేడు తరగతుల తెలుగు పుస్తకాలు

ఈ మూడు తరగతులూ కలిసిపోయి ఒక blur లా ఉన్నాయి.

పరివర్తన అని ఒక పాఠం ఉండేది. ఒకామె చాలా మంచిది కానీ ఆమె భర్త చెడ్డవాడు. ఆయన రాత్రిపూట ఒక మర్రిచెట్టు దగ్గరికెళ్తే బ్రహ్మరాక్షసుడిగా మారిపోవడంలాంటిదేదో చేస్తుంటాడు. ఇది ఐదనుకుంటా.

ఆర్కిమిడిస్ పైన ఒక పాఠం ఉండేది. దాని తర్వాతే దుర్గాదాస్(?) అనే ఆయన చిన్నప్పటి సంఘటన గురించి ఒక పాఠం ఉండేది. దుర్గాదాస్ (అనుకుందాం) ఢాకా వరకూ నడిచివెళ్లి చదువుకుంటుంటాడు. ఒకరోజు రాత్రి బాగా వర్షంపడుతుంది.

ఇనుపకండలు-ఉక్కునరాలు అనే పాఠంలో కోడి రామ్మూర్తిగారి గురించి ఉండేది.

ఏడులో మొదటిపాఠం సువర్ణష్ఠీవి. చాలామందికి గుర్తుండుంటుంది. అతడసలే "రూపసి" కూడా!

ఏడులో మాడపాటి హనుమంతరావు, మాగంటి(?) అన్నపూర్ణాదేవి (M.A.D అనేవారు) లపై పాఠాలుండేవి.

ఐదులోనేమో దుర్గాబాయి దేశముఖ్ పైన ఒక పాఠముండేది. ఆమెని చిన్నప్పుడు ఒక event కి కాపలా పెడితే నెహ్రూని కూడా టికెట్ లేకుండా లోపలికి రానివ్వదు.

ఇంకొక standard lesson ఉండేది. ఒక ముసలివాడు మామిడి టెంక నాటుతుంటే ఒక రాజు వెక్కిరిస్తాడు. ఆ ముసలివాడు అప్పుడు point explain చేస్తాడు. నార్లవారి రచన అనుకుంటా ఇది.

ఆరేడు తరగతుల్లో తెలుగు non-detailed texts మదర్ థెరెసా, సరోజిని నాయుడు అనుకుంటా.

పాఠంలో ఏముంటే మనకి ఏళ్లు గడిచినా గుర్తుంటుందనేదాన్ని రిసెర్చ్ చేయాలి. M.A.D లాంటివాటికి ఎవరూ ఏమీ చేయలేరుగానీ ప్రతిపాఠంలో కనీసం ఒక్క remarkable విషయాన్నన్నా పెట్టగలగాలి.